ఎన్నికల్లో ఎనడీఏ అభ్యర్థులను గెలిపిద్దాం
ABN , Publish Date - Apr 23 , 2024 | 11:47 PM
టీడీపీ, బీజేపీ, జనసేన(ఎనడీఏ)కూటమి అభ్య ర్థులను గెలిపిద్దాం, మదనపల్లెను కొత్త జిల్లా చేసుకుందామని టీడీపీ సీటీఎం క్లస్టర్ ఇనచార్జి చల్లా నరసింహులు పిలు పునిచ్చారు.
మదనపల్లె టౌన, ఏప్రిల్ 23: టీడీపీ, బీజేపీ, జనసేన(ఎనడీఏ)కూటమి అభ్య ర్థులను గెలిపిద్దాం, మదనపల్లెను కొత్త జిల్లా చేసుకుందామని టీడీపీ సీటీఎం క్లస్టర్ ఇనచార్జి చల్లా నరసింహులు పిలు పునిచ్చారు. మంగళవారం సీటీఎం కస్పా, సీటీఎం క్రాస్రోడ్డు పంచాయతీల్లో బీజేపీ నాయకులతో కలసి ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ టీడీపీకి కంచుకో టలాంటి సీటీఎం రెండు పంచాయతీల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నామ న్నారు. సీటీఎం పెద్దచెరువు అభివృద్ధికి మాట ఇచ్చిన టీడీపీ అభ్యర్థి షాజహానబాషాను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లారి కిరణ్కుమార్రెడ్డిలకు ఓటు వేసి, వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మోర్చా నాయకుడు ఓసూరి కిరణ్, మాజీ సర్పంచ రెడ్డిస్వామి, చల్లా శ్రీనివాసులు, వేమన్న, కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.