Share News

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే కిశోర్‌ సాయం

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:20 PM

కల కడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి తక్షణ అవసరాల కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే కిశోర్‌ సాయం
ఎమ్మెల్యే కిశోర్‌ కుమార్‌రెడ్డి తరపున ఆర్థిక సాయం అందజేస్తున్న ఆయన పీఏ సత్య, టీడీపీ నాయకులు

పీలేరు/కలకడ, అక్టోబరు 22 : కల కడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి తక్షణ అవసరాల కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆయన సాయం అందించారు. ప్రమా దం సమాచారం తెలుసుకున్న వెంటనే ఆయన మంగళవారం ఉదయం తన వ్యక్తిగత కార్యదర్శి సత్య, కలికిరి మండలం టీడీపీ అధ్యక్షుడు నిజాముద్దీన, టి.సండ్రావారిపల్లె మాజీ సర్పంచ జబ్బార్‌ సాహెబ్‌, నాయకులు ముస్తఫా హజరత, సనావుల్లా, ముజితబ, డాక్టర్‌ రఫీ, దూదేకులపల్లె సర్పంచ ఖాదర్‌వలీ, కలికిరి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అస్లాం, నాయకు లు మున్నా, రెడ్డప్పరెడ్డి, పవన కుమార్‌లను అప్రమత్తం చేశారు. వారు హుటాహుటిన పీలేరు ప్రభు త్వ ఆసుపత్రికి చేరుకుని పోలీసులు, వైద్యులతో సమన్వ యం చేసుకుని మృతదేహాలకు త్వరితగతిన పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను స్వగ్రామాల కు తరలించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పు న నగదు అందించారు. ఆయనతోపాటు టీడీ పీ నాయకులు ఆతిఖా షఫీ, పఠాన మౌలా, మనోహర, పసుపులేటి లక్ష్మీకర పాల్గొన్నారు. ఎమ్మెల్యే వచ్చిన వెంటనే దూదేకులపల్లెను సందర్శిస్తారని, ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాల వారిని ఆదుకుంటారని ఆయన పీఏ సత్య పేర్కొన్నారు. కలకడ సీఐ గురునాథ్‌, ఎస్‌ఐ రామాంజనేయులు పీలేరు ఆసుపత్రికి చేరుకుని అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి పోస్టుమార్టంకు సహకరించారు.

Updated Date - Oct 22 , 2024 | 11:20 PM