Share News

ఘనంగా పోలీసు అమరవీరులసంస్మరణ దినోత్సవం

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:40 PM

సమాజంలోని ప్రజల ధన, మాన ప్రాణరక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పులివెందుల ట్రాఫిక్‌ సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ హాజీవల్లి అన్నారు.

ఘనంగా పోలీసు అమరవీరులసంస్మరణ దినోత్సవం
దివ్యాంగుడికి దుప్పట్లు అందిస్తున్న హాజీవల్లి

పులివెందుల టౌన, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): సమాజంలోని ప్రజల ధన, మాన ప్రాణరక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పులివెందుల ట్రాఫిక్‌ సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ హాజీవల్లి అన్నారు. పోలీసు అమవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం 30 మంది దివ్యాంగులకు హాజీవల్లి దుప్పట్లు పంపిణీ చేశారు. అంతకు ముందు పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రాణాలర్పించిన పోలీసుల ఆత్మశాంతి కోసం వారు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం దివ్యాంగులకు స్వీట్లు, పండ్లు అందించారు. ఈ కార్యక్రమానికి వికలాంగుల నెట్‌వర్క్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఇరికిరెడ్డి రఘునాథ్‌రెడ్డి అధ్యక్షత వహించారు.

Updated Date - Oct 21 , 2024 | 11:40 PM