కూటమి విజయం తథ్యం..150 సీట్లు ఖాయం
ABN , Publish Date - Apr 08 , 2024 | 12:06 AM
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపు ఖాయమని, 150 సీట్లు సాధించడం ఖచ్చితమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
కలకడ, ఏప్రిల్ 7:రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపు ఖాయమని, 150 సీట్లు సాధించడం ఖచ్చితమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్కుమార్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన నాయకులతో కలిసి కలకడ మండలం గుడిబండ పంచాయ తీలోని చొక్కనవారిపల్లె, పాపిగారిపల్లె, తెట్టు తదితర గ్రామాల్లో బాబు ష్యూరిటీ-భవిష్యత గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింట కరపత్రాలను అందజేసి మేనిఫెస్టోను వివరిం చారు. అనంతరం మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబా బునాయుడు ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోందన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్ట్టేందుకు ప్రజలు కూటమిని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారపు రవిప్రకాశ, మద్దిపట్ల సూర్యప్రకాశ, నాయకులు బరకం శ్రీనివాసుల రెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ప్రభాకర్నాయుడు, తిరుపతినాయు డు, కోట రమణ, బివిస్వామి, కాంతారావు, పివిరమణనాయుడు, త్యాగ రాజు, ధీరజ్రెడ్డి, ఆనంద్రెడ్డి, రాజేంద్ర, ఫీరయ్య, ప్రసాద్నాయుడు, సుదర్శన, ఆంజినేయులు, రెడ్డెప్పరెడ్డి పాల్గొన్నారు.