Share News

తొగట కులస్థుల్లో రాజకీయ చైతన్యం రావాలి

ABN , Publish Date - Sep 01 , 2024 | 11:26 PM

తొగట కులస్థులు ఐకమత్యంతో మెలిగి రాజకీ య చైతన్యం రావాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ పేర్కొన్నారు.

తొగట కులస్థుల్లో రాజకీయ చైతన్యం రావాలి
ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌

కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌

మదనపల్లె అర్బన, సెప్టెంబరు1: తొగట కులస్థులు ఐకమత్యంతో మెలిగి రాజకీ య చైతన్యం రావాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక రింగ్‌రోడ్డు చౌడేశ్వరీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొగటవీరక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు పురాణం చంద్రశేఖర్‌, కార్యదర్శి పవ నకుమార్‌, ఉపాధ్యక్షుడు రామిశెట్టి రత్నమయ్య, సభ్యులు, తెలుగు యువత రాష్ట్ర అధ్య క్షుడు శ్రీరాంచినబాబు, టీడీపీ సీనియర్‌ నాయకుడు మోడెం సిద్ధప్ప కలిసి ఎమ్మెల్యే కంది కుంట వెంకట ప్రసాద్‌ను పూలమాలతో, దుశ్శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొగట కులస్థులను అన్ని విధాల అభివృద్ధి దిశగా నడిపిస్తానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్థిఽకంగా ఎదిగినప్పుడే సమాజా అభివృద్దికి తోడ్పడతారని ఆయన చెప్పారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రామిశెట్టి నీలకంఠ, రామిశెట్టి చంద్రయ్య, ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయకమి అధ్యక్షుడు పురాణం వెంకట రత్నం, నాగరాజ, లక్ష్మీనారాయణ, వెంకటేష్‌, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2024 | 11:26 PM