Share News

Constituency development నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

ABN , Publish Date - Sep 23 , 2024 | 11:27 PM

అధికారంలోకి వచ్చిన వంద రోజల్లోనే పలు అభివృద్ధి పనులు అమలు చేశామని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తెలిపారు. మండల పరిధిలోని కాకర్లవారిపల్లె గ్రామ పంచాయతీలో సుమారు రూ7.52 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులకు టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానంద రెడ్డితో కలసి భూమి పూజ చేశారు.

Constituency development నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
కొబ్బరికాయలు కొట్టి రోడ్డు పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌, ముక్కా రూపానందరెడ్డి

ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ఫ టీడీపీ ఇనచార్జితో కలసి రోడ్డు పనులకు భూమిపూజ

ఓబులవారిపల్లె, సెప్టెంబరు 23: అధికారంలోకి వచ్చిన వంద రోజల్లోనే పలు అభివృద్ధి పనులు అమలు చేశామని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తెలిపారు. మండల పరిధిలోని కాకర్లవారిపల్లె గ్రామ పంచాయతీలో సుమారు రూ7.52 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులకు టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానంద రెడ్డితో కలసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంతో రోడ్డు సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ఈ సందర్భంగా స్థానికులు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు పున్నాటి వాసుదేవరెడ్డి, కల్లా చలపతి, రామచంద్రయ్యనాయడు, శివయ్యనాయుడు, సర్పంచ వెంకటయ్యనాయుడు, వేమన సుబ్రమణ్యంనాయుడు, బత్తిన వేణుగోపాల్‌రెడ్డి, ఆర్‌ అండ్‌ బి అధికారులు, పంచాయతిరాజ్‌ అదికారులు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

పుల్లంపేట: పుల్లంపేటలోని ఎస్‌ఎస్‌ కల్యాణమండపంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రతో కలిసి ఇది మంచి ప్రభుత్వం కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఇనచార్జి ముక్కా రూపా నందరెడ్డి మాట్లాడుతూ రైల్వేకోడూరులో ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు అన్నమయ్య విద్యాసంస్థల అధినేత చొప్పా గంగిరెడ్డితో మాట్లాడి ఒప్పించా మన్నారు. 25 కోట్ల రూపాయలతో ప్రస్తుతం రోడ్ల పనులు చేస్తున్నా మన్నారు. జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ జగన మోసపురెడ్డి రాష్ట్రాన్ని ఐదేళ్లలో అధోగతిపాలు చేశాడన్నారు. టీడీపీ మండల ఇనచార్జి ఆరె సుధాకర్‌ నాయుడు, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ నాయుడు, జనసేన రాయలసీమ కన్వీనర్‌ జోగినేని మణి, మండల బీజేపీ అధ్యక్షులు రామకృష్ణయ్య, జనసేన మండల ఇనచార్జి ప్రసాద్‌, డీఎల్‌పీవో నరసింహమూర్తి, ఎంపీడీవో రఘురాం, తహసీల్దారు అరవింద కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

పవన కల్యాణ్‌కు సంఘీభావంగా ప్రాయశ్చిత్త దీక్ష

రైల్వేకోడూరు: ప్రాయశ్చిత దీక్ష చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవనకళ్యాణ్‌కు మద్దతుగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ సోమవారం రైల్వే కోడూరులోని ప్రసన్నవెంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు దేవుడితో కూడా ఆటలు ఆడుకున్నారని తెలిపారు. అనంతరం ఆలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2024 | 11:27 PM