‘రా...కదిలిరా’తో వైసీపీలో వణుకు పుడుతోంది
ABN , Publish Date - Jan 06 , 2024 | 11:48 PM
టీడీపీ, జనసేన ఉమ్మడిగా చేపట్టిన ‘రా...కదిలిరా’ కార్య క్రమం ద్వారా వైసీపీకి వణుకుతోపాటు ఆపార్టీ పునాదులు కదులుతున్నాయని పీలేరు టీడీపీ నేతలు పేర్కొన్నారు.
ఫ పీలేరు టీడీపీ నేతలు ఫ 24న చంద్రబాబు బహిరంగ సభ
పీలేరు, జనవరి 6: టీడీపీ, జనసేన ఉమ్మడిగా చేపట్టిన ‘రా...కదిలిరా’ కార్య క్రమం ద్వారా వైసీపీకి వణుకుతోపాటు ఆపార్టీ పునాదులు కదులుతున్నాయని పీలేరు టీడీపీ నేతలు పేర్కొన్నారు. పీలే రులోని పార్టీ కార్యాలయంలో శనివారం వారు విలేఖరుల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెం టు అధికార ప్రతినిధి కోటపల్లె బాబు రెడ్డి మాట్లాడుతూ ‘తెలుగుదేశం పిలుస్తోంది, రా...కదిలిరా’ అన్న నినాదంతో 1983లో స్వర్గీయ ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ పెత్తనానికి స్వస్తి పలికారని గుర్తు చేశారు. మళ్లీ అదే నినాదంతో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు, పవన కళ్యాణ్ చేపట్టిన ‘రా...కదిలిరా’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అరాచక వైసీపీ పాలనను అంతమెందిస్తారని తెలిపారు. అందుకు ఇటీవల ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రజలే సాక్ష్యమన్నారు. ఈ నెల 24న పీలేరులో చంద్రబాబు నాయుడు బహిరంగ సభ ఉం టుందని తెలిపారు. పీలేరు మండల పార్టీ అధ్యక్షుడు వారణాశి శ్రీకాంత రెడ్డి ఈ నెల 24న పీలేరులో జరిగే చంద్రబాబు బహిరంగ సభలో రాజంపేట పార్లమెంటు పరిధిలోని ప్రతి టీడీపీ సభ్యుడు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర బీసీ సాధికార కమిటీ కార్యదర్శి పురం రామ్మూర్తి, నాయకులు అమరనాథరెడ్డి, లక్ష్మీకర, కంచి సూరి, మట్టి వెంకటరమణారెడ్డి, రహంతుల్లా, హనీఫ్, కేజీఎన రెడ్డిబాషా, సుబ్బ య్య, ఖాజాపీర్, గాండ్ల విజయ్ కుమార్, రెడ్డిముని, కప్పరం చంద్రయ్య, షామియాన జయన్న, సుభాష్, వెంకటరమణ నాయక్, మహమ్మద్ పీర్, ఫర్హత పాల్గొన్నారు.