యువత చూపు లోకేష్ వైపు..
ABN , Publish Date - Feb 12 , 2024 | 10:51 PM
రాష్ట్ర యువత టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ వైపు చూస్తోందని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ తెలిపారు.
టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని
రైల్వేకోడూరు(రూరల్) ఫిబ్రవరి 12: రాష్ట్ర యువత టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ వైపు చూస్తోందని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేఖరులతో మాట్లాడారు. భూ కజ్జాలు, లిక్కర్ , ఇసుక మాఫి యాపై వైసీపీ నాయకులు పెట్టిన శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై పెట్టి ఉంటే యువతకు ఉద్యోగావకా శాలు పుష్కలంగా ఉండేవన్నారు. త్వరలో జరగ నున్న సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ జనసేన పార్టీలకు ప్రజలు పట్టం కట్టనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బొక్కసం చలపతి, తెలుగు యువత నాయకులు బొక్కసం సునీల్, కూని చంద్రయ్య, అమర్, కస్తూరి దినేష్, చిగురుపాటి శంకర, మందపాటి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.