Share News

ఏలూరు కాలువ గండిని పూడ్చాలి

ABN , Publish Date - Sep 20 , 2024 | 01:00 AM

కేసరపల్లి వద్ద ఏర్పడిన ఏలూరు కాలువ గండిని యుద్ధప్రాతిపదికన పూడ్చాలని రైతు సంఘం మండల కార్యదర్శి సూరగాని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

ఏలూరు కాలువ గండిని పూడ్చాలి
బుద్ధవరం ఆర్బీకే వద్ద ఆందోళన చేస్తున్న రైతు సంఘం నాయకులు

గన్నవరం, సెప్టెంబరు 19: కేసరపల్లి వద్ద ఏర్పడిన ఏలూరు కాలువ గండిని యుద్ధప్రాతిపదికన పూడ్చాలని రైతు సంఘం మండల కార్యదర్శి సూరగాని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. బుద్ధవరం ఆర్బీకే వద్ద రైతు సంఘం నాయకులు గురువారం ఆందోళన నిర్వహించారు. ఏలూరు కాలు వకు ఏర్పడిన గండిని పూడ్చకపోవడం వల్ల నీరంతా పంట పొలాల మీదు గా ప్రవహిస్తోందని, వందల ఎకరాలు నీటి పాలయ్యాయని సాంబ శివరావు ఆవేదన వ్యక్తం చేశారు. గండిని పూడ్చాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. నక్కా రామయ్య, ఆదిశేషు, గండికోట దశరథరా మయ్య, మల్లంపల్లి ఆంజనేయులు, నక్కా వెంకట్రామయ్య, బడుగు మరి యదాసు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 01:00 AM