Share News

20 వేల మందికి ఉపాధి కల్పిస్తా

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:45 AM

‘‘ఐదేళ్ల వైసీపీ పాలనలో గుడివాడ నియోజక వర్గం అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. ఇక్కడ విద్యావంతు లు, యువత ఎక్కువగా ఉన్నారు. 20వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశా.’’ అని ప్రజలకు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము హామీ ఇచ్చారు.

20 వేల మందికి ఉపాధి కల్పిస్తా
గుడివాడ 31వ వార్డులో ఎన్నికల ప్రచారంలో స్థానికులతో సెల్ఫీ దిగుతున్న వెనిగండ్ల రాము

గుడివాడ ప్రజలకు వెనిగండ్ల రాము హామీ

గుడివాడ: ‘‘ఐదేళ్ల వైసీపీ పాలనలో గుడివాడ నియోజక వర్గం అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. ఇక్కడ విద్యావంతు లు, యువత ఎక్కువగా ఉన్నారు. 20వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశా.’’ అని ప్రజలకు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము హామీ ఇచ్చారు. శుక్రవారం 31వ వార్డులో ఇంటింకీ తిరుగుతూ ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. నియోజకవ ర్గంలో అంతర్గత డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచి, అంతర్గత రహదారులను నిర్మిస్తానని బాలశౌరితో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన హామీ యిచ్చారు. సైకిల్‌ గుర్తుపై ఓటేసి తనను, గాజుగ్లాసు గుర్తుపై ఓటేసి బాలశౌరిని గెలిపిం చాలని ప్రజలను కోరారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే రావి వెం కటేశ్వరరావు, నాయకులు యలవర్తి శ్రీనివాసరావు, దింట్యాల రాంబాబు, పిన్నమనేని బాబ్జీ, చలసాని సూరిబాబు, జి.సుబ్బా రావు, బి.నానాజీ, కోట శ్రీను, వంగలపూడి రామకృష్ణ, వంగల పూడి రమణ, పాగోలు వెంకటేశ్వరరావు, ఎం.ఆది, చంద్రశేఖర్‌, విలియం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:45 AM