జగ్గయ్యపేట ఆర్టీసీ డీఎం నిరంకుశ వైఖరికి నిరసనగా..
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:49 AM
జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రఘురాం నిర్లక్ష్య, నిరంకుశ వైఖరికి నిరసనగా ఈ నెల 4వ తేదీ నుంచి ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు రిలేదీక్షలతో పాటు, సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తామని యూనియన్ నేతలు పసుపు లేటి శ్రీను, కల్యాణం క్రిష్ణారావు, ఇమామ్, ఆనంద్ హెచ్చరించారు.
జగ్గయ్యపేట, ఫిబ్రవరి 29: జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రఘురాం నిర్లక్ష్య, నిరంకుశ వైఖరికి నిరసనగా ఈ నెల 4వ తేదీ నుంచి ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు రిలేదీక్షలతో పాటు, సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తామని యూనియన్ నేతలు పసుపు లేటి శ్రీను, కల్యాణం క్రిష్ణారావు, ఇమామ్, ఆనంద్ హెచ్చరించారు. డిపో గేటు ఎదుట గురువారం నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతూ నాలుగు నెలలుగా డిపోలో సమస్యలపై విన్నవిస్తున్నా కనీసం పట్టించుకోకపోవటంతో పాటు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లతో కార్మికులపై తప్పుడు కేసులు పెట్టించటం, ఫిర్యాదులపై విచారణ చేయకుండా సూపర్ వైజర్లను వెనుకేసుకు వస్తున్నారని ఆరోపించారు. డిపోలో ఆందోళనలతో ప్రయాణికులకు కలగే ఇబ్బందులకు డీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.