దుర్గమ్మ సేవలో జస్టిస్ వి.శ్రీనివాస్
ABN , Publish Date - Jun 16 , 2024 | 12:51 AM
కనకదుర్గమ్మను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ కుటుంబసభ్యులతో దర్శిం చుకున్నారు.
వన్టౌన్, జూన్ 15: దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మను శని వారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ కుటుంబసభ్యులతో కలిసి దర్శిం చుకున్నారు. ఆలయ ఈవో కేఎస్ రామారావు, అధికారులు వారికి సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్తాన్ని ఈవో అందజేశారు.