Share News

మిస్‌ అండ్‌ మిస్టర్‌ టీన్‌ ఇండియా విజేతగా నేహాంజలి

ABN , Publish Date - Sep 21 , 2024 | 01:48 AM

అలీ క్లబ్‌ మిస్‌ అండ్‌ మిస్టర్‌ టీన్‌ ఇండియా- 2024 ఫైనల్లో విజేతగా నేహాంజలి(14) నిలిచింది.

మిస్‌ అండ్‌ మిస్టర్‌ టీన్‌ ఇండియా విజేతగా నేహాంజలి
మిస్‌ అండ్‌ మిస్టర్‌ టీన్‌ ఇండియా టైటిల్‌తో నేహాంజలి

భవానీపురం, సెప్టెంబరు 20: అలీ క్లబ్‌ మిస్‌ అండ్‌ మిస్టర్‌ టీన్‌ ఇండియా- 2024 ఫైనల్లో విజేతగా భవానీపురానికి చెం దిన దండా రాంబాబు, సామ్రాజ్యం కుమార్తె నేహాంజలి(14) నిలిచింది. కఠోర సాధన, తపస్సుతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. నేహాంజలికి చిన్నతనం నుంచి మోడలింగ్‌ లో ఆసక్తి ఉండటంతో ఇటీవల ఢిల్లీ వేదికగా నిర్వహించిన అలీ క్లబ్‌ మిస్‌ ఇండియా -2024 ఫైనల్‌ పోటీల్లో బరిలో దిగింది. 167 నగరాలకు చెందిన 90 మంది పాల్గొన్నారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 50 మందిని ఫైనల్‌కు ఎంపిక చేయగా అందులో నేహాంజలి విజేతగా నిలిచింది. ఆమెను మొఘ ల్రాజపురం శ్రీచైతన్య టెక్నో స్కూల్‌ ప్రిన్సిపాల్‌ షబానా ఫిర్దోస్‌, రీజనల్‌ ఇన్‌చార్జి ఆర్‌.పద్మ, డీన్‌ టి.చరణ్‌ సన్మానించారు.

Updated Date - Sep 21 , 2024 | 01:48 AM