Share News

ప్రమాదకరంగా రోడ్డు!

ABN , Publish Date - Feb 14 , 2024 | 01:02 AM

ఉయ్యూరు- కాటూరు- తేలప్రోలు ఆర్‌అండ్‌బీ రోడ్డు కోతకుగురై ప్రమాదకరంగా మారింది. వాహ నచోదకులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఉయ్యూరు నుంచి కాటూరు, తేలప్రోలు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు శ్రీవిశ్వశాంతి స్కూల్‌ సమీపాన కోసుకుపోతూ ప్రమాదస్థితికి చేరుకుంది.

 ప్రమాదకరంగా రోడ్డు!
కోతకు గురైన రోడ్డు

ఉయ్యూరు, ఫిబ్రవరి 13 : ఉయ్యూరు- కాటూరు- తేలప్రోలు ఆర్‌అండ్‌బీ రోడ్డు కోతకుగురై ప్రమాదకరంగా మారింది. వాహ నచోదకులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఉయ్యూరు నుంచి కాటూరు, తేలప్రోలు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు శ్రీవిశ్వశాంతి స్కూల్‌ సమీపాన కోసుకుపోతూ ప్రమాదస్థితికి చేరుకుంది. స్కూల్‌ కు వెళ్లే విద్యార్థులతో పాటు మండల పరిధి గ్రామాలతో పాటు ఉంగుటూరు, పెదపారుపూడి మం డలాల గ్రామాలకు వెళ్లే వాహనాలు, బస్సులతో అనునిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో స్కూల్‌ సమీపాన కొంతమేర ఓ పక్క కోతకు గురైంది. ఈ ప్రాం తంలో రోడ్డు పక్కన గ్రామ పంచాయతీ చెత్తకుండీలు ఏర్పాటు చేయగా రోడ్డు పొడవునా పరిసర ప్రాంతాల్లో నివసించేవారు ఇళ్లలోని వ్యర్థాలు, చెత్తపోయడంతో ఎలుకలు చేరి రోడ్డును తొలచి వేస్తున్నాయి. దీంతో కొంత మేర రోడ్డు డొల్లగా తయారై ప్రమాదకరంగా ఉంది. ఆర్‌అండ్‌బీ అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు మరింత మేర కోతకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, గండిగుంట గ్రామ పంచాయతీ అధికారులు కూడా చెత్తకుండీలు అక్కడ నుంచి తొలగించి మరో చోట ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 14 , 2024 | 01:02 AM