Share News

రేపు 500 మందితో జనసేనలో చేరుతున్నాం

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:50 AM

కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి సమక్షంలో 500 మందితో కలిసి జనసేన పార్టీలో చేరుతున్నామని వైసీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్‌ గోకరకొండ బలరాం, కొయిలాపు రాములు తెలిపారు.

రేపు 500 మందితో జనసేనలో చేరుతున్నాం

వైసీపీ గుడివాడ నాయకులు గోకరకొండ బలరాం, కొయిలాపు రాములు

గుడివాడ: కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి సమక్షంలో 500 మందితో కలిసి జనసేన పార్టీలో చేరుతున్నామని వైసీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్‌ గోకరకొండ బలరాం, కొయిలాపు రాములు తెలిపారు. శుక్రవారం ముగ్గుబజారులోని తన కార్యాలయంలో బలరాం విలేకరులతో మాట్లాడారు. ఆదివారం జీవీఆర్‌ కల్యాణమండపంలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయనతోపాటు సమావేశంలో వైసీపీ నాయకులు సుంకర భాస్కర్‌, వెంపల గోపాల్‌, ఘంటా కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:50 AM