విమానాశ్రయంలో నారా భువనేశ్వరికి ఘనంగా వీడ్కోలు
ABN , Publish Date - Apr 07 , 2024 | 12:35 AM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు పరామర్శించేందుకు గత రెండు రోజులుగా నంద్యాల జిల్లాలో డోన్, పాణ్యం, ఆత్మకూరు, నంద్యాలలో పర్య టించి నిజం గెలవాలని కార్యక్రమాన్ని నారా భువనేశ్వరి దిగ్విజయంగా ముగిం చుకుని శనివారం ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్నారు.
ఓర్వకల్లు, ఏప్రిల్ 6: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు పరామర్శించేందుకు గత రెండు రోజులుగా నంద్యాల జిల్లాలో డోన్, పాణ్యం, ఆత్మకూరు, నంద్యాలలో పర్య టించి నిజం గెలవాలని కార్యక్రమాన్ని నారా భువనేశ్వరి దిగ్విజయంగా ముగిం చుకుని శనివారం ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్నారు. ఆమెకు పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత, నంద్యాల టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, ముస్లిం మైనార్టీ నాయకులు మహబూబ్బాషా, మాజీ సర్పంచ్ మల్లెల జ్యోతి, మహిళలు, కార్యకర్తలు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఆమె హైదరాబాదుకు బయలుదేరి వెళ్లారు.