దరఖాస్తులను పరిష్కరించండి
ABN , Publish Date - Mar 14 , 2024 | 12:44 AM
పెండింగ్లో ఉన్న ఓటర్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
కర్నూలు(కలెక్టరేట్), మార్చి 13: పెండింగ్లో ఉన్న ఓటర్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటరు దరఖాస్తులు ఏ ఒక్కటి కూడా పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. ఎపిక్ కార్డులు వచ్చిన వెంటనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్ర మంలో కలెక్టర్ జి. సృజన, ఎస్పీ జి.కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.