Share News

టీనేజీలో జాగ్రత్తగా ఉండాలి : డీఎస్పీ

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:43 AM

టీనేజీ వయ స్సులో విద్యార్థినులు జాగ్రత్తలు పాటించాలని పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య సూచించారు.

టీనేజీలో జాగ్రత్తగా ఉండాలి : డీఎస్పీ
విద్యార్థినులకు బహుమతులు అందజేస్తున్న డీఎస్పీ

పత్తికొండ టౌన్‌, అక్టోబరు 21, (ఆంధ్రజ్యోతి): టీనేజీ వయ స్సులో విద్యార్థినులు జాగ్రత్తలు పాటించాలని పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య సూచించారు. సోమవారం పభుత్వ బాలికల ఉన్న త పాఠశాలలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి శ్రీనివాసు లు ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. హెచ్‌ఎం భ్రమరాంబ, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐ జయన్న, అరసం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 01:43 AM