Share News

తొలిసారిగా మంత్రాలయం వచ్చిన బిష్‌పలు

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:27 AM

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి బళ్లారి బిషప్‌ రైట్‌ రెవ.హెండ్రీ డిసౌజా, రెవ.ఫాదర్‌ ఈవెన ఫింటో మంగళవారం మంత్రాలయం వచ్చారు.

తొలిసారిగా మంత్రాలయం వచ్చిన బిష్‌పలు
పీఠాధిపతిని సన్మానిస్తున్న బళ్లారి బిష్‌పలు

ఇంటర్‌ రిలీజియస్‌ సమావేశానికి పీఠాధిపతికి పిలుపు

మంత్రాలయం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి బళ్లారి బిషప్‌ రైట్‌ రెవ.హెండ్రీ డిసౌజా, రెవ.ఫాదర్‌ ఈవెన ఫింటో మంగళవారం మంత్రాలయం వచ్చారు. వీరికి మఠం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో ప్రత్యేక సమావేశమై బళ్లారిలో నవంబరు నెల 27న జరిగే ఇంటర్‌ రిలీజియస్‌ సమావేశానికి ముఖ్యఅతిథిగా రావాలని పీఠాధిపతిని ఆహ్వానించారు. అనంతరం క్రిస్టియన బిష్‌పలకు రాఘవేంద్రస్వామి చరిత్రను థామస్‌ మండ్రో చేసిన సేవలను వివరించారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు బిష్‌ఫలకు రాఘవేంద్రస్వామి మెమెంటో, శేషవస్త్రం, ఫలపుష్ప మంత్రాక్షితలు పరిమళ ప్రసాదం ఇచ్చారు. అదే విదంగా బళ్లారి బిషప్‌ రైట్‌ రెవ.హెండ్రీ డిసౌజా, ఫాదర్‌ ఈవెన ఫింటోలు పట్టువస్త్రం, శాలువ గ్రంథాలను అందజేసి సత్కరించారు.

Updated Date - Oct 23 , 2024 | 12:27 AM