వరద బాధితుల కోసం విరాళాల సేకరణ
ABN , Publish Date - Sep 26 , 2024 | 11:56 PM
విజయవాడ వరద బాధితుల కోసం గురువారం డోన్ పట్టణంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టీఈ కేశన్నగౌడు ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ శేషఫణి గౌడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కొండపేట, చిగురుమాను పేటలలో విరాళాలను సేక రించారు.
డోన్, సెప్టెంబరు 26: విజయవాడ వరద బాధితుల కోసం గురువారం డోన్ పట్టణంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టీఈ కేశన్నగౌడు ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ శేషఫణి గౌడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కొండపేట, చిగురుమాను పేటలలో విరాళాలను సేక రించారు. ఈ సందర్భంగా కేశన్నగౌడు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోట్ల ఆదేశాల మేరకు వరద బాధితుల కోసం తమ వంతుగా విరాళాలు సేకరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఈ రాఘవేం ద్రగౌడు, కిరణ్ యాదవ్, ఎల్లగౌడు, గోసానిపల్లి మాజీ సర్పంచ్ శ్రీరాములు, ధర్మవరం సంజీ వుడు, కొచ్చెర్వు అశోక్, నూర్బాషా, యాపదిన్నె శ్రీనివాసులు, గుండాల నారాయణ స్వామి, ఓబులాపురం మనోహర్ పాల్గొన్నారు.