Share News

కుక్కల దాడిలో జింక మృతి

ABN , Publish Date - Jul 10 , 2024 | 12:42 AM

మండలంలోని రోళ్లపాడు గ్రామ పొలిమేరలో ఉన్న రోళ్లపాడు చెరువు సమీపంలో కుక్కదాడిలో జింక మృతి చెందింది.

కుక్కల దాడిలో జింక మృతి

మిడుతూరు, జూలై 9: మండలంలోని రోళ్లపాడు గ్రామ పొలిమేరలో ఉన్న రోళ్లపాడు చెరువు సమీపంలో కుక్కదాడిలో జింక మృతి చెందింది. రోళ్లపాడు అభయ అరణ్యం చుట్టు పక్కల పొలాల్లో కంచె లేనందున, పోలాల్లోకి వచ్చిన జింకను కుక్కలు వెంబడించి దాడి చేయడంతో అక్కడికి అక్కడే జింక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం స్థానిక డీఆర్వో జిహన్‌ తహేర్‌ను వివరణ కోరగా కుక్కల దాడిలో జింక మృతి చెందినట్లు తెలిపారు.

Updated Date - Jul 10 , 2024 | 12:42 AM