Share News

పన్ను వసూళ్లలో గణనీయ వృద్ధి

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:22 AM

నగర పాలక సంస్థ పరిధిలో పన్ను వసూళ్లలో గణనీయ వృద్ధి సాధించినట్లు కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు తెలిపారు.

పన్ను వసూళ్లలో గణనీయ వృద్ధి
పన్ను వివరాలను కమిషనర్‌కు అందజేస్తున్న అడిషనల్‌ కమిషనర్‌

కర్నూలు, న్యూసిటీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థ పరిధిలో పన్ను వసూళ్లలో గణనీయ వృద్ధి సాధించినట్లు కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు తెలిపారు. ఈ నెల 17 నుంచి రెవెన్యూ విభాగం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా రూ.94,53,000 పన్ను వసూలు చేసిన వివరాలను అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ కమిషనర్‌కు అందజేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ నగరాభి వృద్ధికి పన్నులు ఎంతో కీలకమన్నారు. దీనిని గ్రహించి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో ఆస్తిపన్ను రూ.89,25,000, నీటి పన్ను రూ.5,28,000 వసూలు చేశారన్నారు. నూతనంగా నియమి తులైన ఆర్‌ఐలు పన్ను వసూలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. సిబ్బందిని కమిషనర్‌ అభినందిం చారు. ఆర్‌వో జునైద్‌, ఆర్‌ఐలు శేషాద్రి, ఎం.రాజు, ఎస్‌.తిప్పన్న, పి.భార్గవత, ఎం.నాగరాజు ఉన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 01:22 AM