తల్లికి బాలుడి అప్పగింత
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:21 AM
గ్రామంలోని బలిజపేటలో తప్పిపోయి కనిపించిన ఓ బాలుడిని స్థానికులు గుర్తించి శిరివెళ్ల పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
శిరివెళ్ల, ఏప్రిల్ 18 : గ్రామంలోని బలిజపేటలో తప్పిపోయి కనిపించిన ఓ బాలుడిని స్థానికులు గుర్తించి శిరివెళ్ల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నంద్యాల మండలం చాబోలుకు చెందిన ప్రసన్న తన కుమారుడు వరుణ్తో శిరివెళ్లలోని చాకలిపేటలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చారు. బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటూ బలిజపేటలోకి వెళ్లిపోయాడు. అనంతరం ఎస్ఐ సురేష్ తన సిబ్బందితో విచారణ నిర్వహించి తల్లి ప్రసన్నను స్టేషన్కు పిలిపించి గురువారం బాలుడిని అప్పగించారు. తన కుమారుడిని క్షేమంగా అప్పగించిన పోలీసులకు ఆ తల్లి కృతజ్ఙతలు తెలియజేశారు.