జగన్ జైలుకే..ఓటేయకండి
ABN , Publish Date - May 03 , 2024 | 12:20 AM
సీఎం జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్లి వెంకటేశ్వర్లు అన్నారు.
విజనరీ చంద్రబాబుకు పట్టం కట్టండి
సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు(అర్బన్), మే 1: సీఎం జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్లి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్ధిక నేరాల కేసుల్లో జూన్ 4 తరువాత జగన్ జైలుకు వెళ్తారని, జైలుకు వెళ్లే నాయకుడికి ఓటు వేయవద్దని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఐదేళ్ల నుంచి జగన్ రాష్ట్ర ప్రజలను జలగలా పీడిస్తున్నారని, ఆయనకు ఓటు వేయకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పరిత పిస్తున్న విజనరీ చంద్రబాబుకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం విడుదల చేసిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోకు తోడుగా మొన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయని, వాటిలో తప్పులు వెతికి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని అన్నారు. 4 సంవత్సరాల 11 నెలల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఎంతో నష్టపోయాయని, వైసీపీ నాయకులు తమ ఆరాచకాలతో ప్రజలను వేధించారని అన్నారు. జగన్ సభలను ప్రజలు బహిష్కరించమే దీనికి నిదర్శనం అన్నారు.