Share News

లా సెమిస్టర్‌ ఫలితాలు విడుదల చే యాలి

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:37 AM

లా ఐదో సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలు విడుదల చేయాలని టీఎనఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప డిమాండ్‌ చేశారు.

లా సెమిస్టర్‌ ఫలితాలు విడుదల చే యాలి
ఉపకులపతికి వినతిపత్రం ఇస్తున్న నాయకులు

కర్నూలుఅర్బన, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): లా ఐదో సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలు విడుదల చేయాలని టీఎనఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎనటీకే నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రప్ప మాట్లాడుతూ ఆల్‌ ఇండియా బార్‌ పరీక్షలు రాయడానికి ఈనెల 25వ తేదీ లోపు రిజిసే్ట్రషన చేసుకోవాలని, ఆ లోపు ఐదో సెమిస్టర్‌ ఫలితాలు విడుదల కాకపోతే ఎందరో విద్యార్థులు నష్టపోతారని అన్నారు. కార్యక్రమంలో న్యాయ కళాశాల విద్యా ర్థులు గోవర్ధన, సుమలత, అరుణ, దీప్తి పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:37 AM