నాగుల విగ్రహాలు ధ్వంసం
ABN , Publish Date - May 24 , 2024 | 12:17 AM
ఆళ్లగడ్డ పట్టణ శివార్లలోని కాశీచింతల క్షేత్రంలోని సుబ్రమణ్యంస్వామి, నాగుల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ధ్వంసం చేశారు.
నంద్యాల, మే 23(ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ పట్టణ శివార్లలోని కాశీచింతల క్షేత్రంలోని సుబ్రమణ్యంస్వామి, నాగుల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. గురువారం వేకువజామున పూజలు చేసేందుకు వెళ్లిన శివశంకరశర్మ గమనించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.