ఏపీఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపు
ABN , Publish Date - Jul 03 , 2024 | 12:30 AM
విద్యుత్ వినియోగదారులు ఇకపై ఏపీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా కాని, వెబ్సైట్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించాలని కర్నూలు డివిజన్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ మల్లికార్జున, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రామరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కల్లూరు, జూలై 2: విద్యుత్ వినియోగదారులు ఇకపై ఏపీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా కాని, వెబ్సైట్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించాలని కర్నూలు డివిజన్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ మల్లికార్జున, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రామరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు ఆర్బీఐ ఆదేశాల ప్రకారం యూపీఐ సర్వీస్ ప్రొవైడ ర్లైన ఫోన్పే. పేటిఎం, గూగుల్పే, అమెజాన్ పే బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపు ను నిలివేస్తున్నామని సూచించారు. ఎలాంటి అపరద రుసుం లేకుండా కరెంట్ బిల్పై ఉన్న యజమాని ఫోన్ నెంబరు సరిచేసుకుని ఆ నెంబరుతో రిజిస్టర్ కావలేనని అన్నారు. ప్రతి కరెంట్ బిల్పై యజమాని మొబైల్ఫోన్, ఆధార్ నెంబర్లను సరిచేసుకోవాలని తప్పులేమైనా ఉంటే ర్వైల్వేస్టేషన్ దారి లోని కర్నూలు డివిజన్ కార్యాలయంలో ఒక అర్జీ ఇవ్వాలన్నారు. ఆధార్ను మార్చటానికి జిరాక్స్ కాపి జతపరచాలని ఆయన కోరారు. విద్యుత్ వినియోగ దారులు విషయం గమనించి సకాలంలో బిల్లులు చెల్లించి విద్యుత్ సంస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.