Share News

మొక్కలు నాటండి: కలెక్టర్‌

ABN , Publish Date - Sep 21 , 2024 | 01:25 AM

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్‌ రంజితభాషా విద్యార్థులకు సూచించారు.

మొక్కలు నాటండి: కలెక్టర్‌
మొక్క నాటుతున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే, ఎంపీ

కర్నూలు(రూరల్‌), సెప్టెంబరు 20: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్‌ రంజితభాషా విద్యార్థులకు సూచించారు. కర్నూలు రూరల్‌ మండలం బి.తాండ్రపాడు గ్రామంలోని డైట్‌ కళాశాల యందు శుక్రవారం స్వచ్ఛతా హిసేవా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ రంజిత బాషా, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మొక్కలు నాటి పెంచడం వలన ఆక్సిజన సమృద్ధిగా అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాసరరెడ్డి, డ్వామా పీడీ అమర్నాథరెడ్డి,డీపీఓ నాగరాజునాయుడు, పీఆర్‌ ఏఈ రవిమోహనరెడ్డి ఎంపీడీవో అనురాధ పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 01:25 AM