Share News

నేటి నుంచి జిల్లాలో షర్మిల ‘న్యాయ యాత్ర’

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:25 AM

పీసీసీ అధ్యక్షురాలు వైస్‌ షర్మిల శుక్రవారం నుంచి కర్నూలు జిల్లాలో న్యాయయాత్ర చేపట్టనున్నారని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కే. బాబురావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేటి నుంచి జిల్లాలో షర్మిల ‘న్యాయ యాత్ర’

కర్నూలు(అర్బన్‌), ఏప్రిల్‌ 18: పీసీసీ అధ్యక్షురాలు వైస్‌ షర్మిల శుక్రవారం నుంచి కర్నూలు జిల్లాలో న్యాయయాత్ర చేపట్టనున్నారని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కే. బాబురావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో షర్మిలా పాదయాత్ర వివరాలు వెల్లడించారు. గురువారం రాత్రి ఆలూరులో బస చేశాక 19న ఉదయం 10 గంటలకు ఆలూరులో సమావేశం ఉంటుందని, సాయంత్రం 4 గంటలకు ఆదోని బహిరంగ సభ, సాయంత్రం 6 గంటలకు ఎమ్మిగనూరులో బహిరంగ సభ అనంతరం కడప బయలు దేరి వెళ్తారు. ఈనెల 20న కడపలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తారని, అదేరోజు సాయంత్రం 6 గంట లకు కోడుమూరులో కోట్ల సర్కిల్‌లో బహిరంగ సభ, అనంతరం అక్కడి నుంచి బయలు దేరి కర్నూలు చేరుకుంటారు. ఈనెల 21న ఉదయం 10 గంటలకు కర్నూలు నగరంలో యాత్ర ప్రారంభమై బళ్లారి చౌరస్తా, కొత్త బస్టాండ్‌, శ్రీరామ్‌ టాకీస్‌, ఐదురోడ్ల కూడలి, వైఎస్‌ఆర్‌ సర్కిల్‌, గౌసియా హాస్పిటల్‌, కొండరెడ్డి బురుజు, పాతబస్టాండ్‌, కింగ్‌ మార్కెట్‌, గడియారం హాస్పిటల్‌, చౌక్‌లో మీటింగ్‌, వన్‌టౌన్‌ పోలీస్టేషన్‌, జమ్మిచెట్టు, జోహరాపురం, వెంకాయపల్లి, గార్గేయపురం మీదుగా నంద్యాల జిల్లాలోకి ప్రవేశిస్తారని పేర్కొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:25 AM