నందీశ్వర స్వామికి విశేష పూజలు
ABN , Publish Date - May 15 , 2024 | 12:24 AM
శ్రీశైలం మహాక్షేత్రంలో మంగళవారం లోకకళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య (కుమారస్వామి) స్వామికి, నందీశ్వరస్వామికి, బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు నిర్వహించారు.
శ్రీశైలం, మే 14: శ్రీశైలం మహాక్షేత్రంలో మంగళవారం లోకకళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య (కుమారస్వామి) స్వామికి, నందీశ్వరస్వామికి, బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో దేశం శాంతిసౌభాగ్యాలతో విరిసిల్లాలని అర్చకస్వాములు సంకల్పం పఠించారు, అనంతరం పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహా గణపతిస్వామికి పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకించి మంగళహారతులు సమర్పించారు.
అలరించిన బుర్రకథ
శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో మంగళవారం రాజమహేంద్రవరానికి చెందిన వి. లక్ష్మీ బుర్రకథ బృందంచే పార్వతీకల్యాణంపై బుర్రకథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.