Share News

పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు గాయాలు

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:45 PM

పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు.

పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు గాయాలు
చికిత్స పొందుతున్న విద్యార్థి

ఆళ్లగడ్డ(శిరివెళ్ల), అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. సీఈసీ విభాగంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు శ్వేత, చెన్నకేశవపై పెచ్చులు ఊడిపడ్డాయి. గాయపడిన విద్యార్థులను సహచర మిత్రులు, కళాశాల సిబ్బంది ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. స్టడీ అవర్‌లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రిన్సిపాల్‌ మధుశేఖర్‌ తెలిపారు.

Updated Date - Oct 22 , 2024 | 11:45 PM