Share News

Nara Bhuvaneswari: కాకినాడలో ముగిసిన నారా భువనేశ్వరి తొలిరోజు పర్యటన

ABN , Publish Date - Jan 24 , 2024 | 07:36 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా.. కాకినాడ జిల్లాలో తన మొదటి రోజు పర్యటనని ముగించుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో వేదనకు గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకే ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

Nara Bhuvaneswari: కాకినాడలో ముగిసిన నారా భువనేశ్వరి తొలిరోజు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా.. కాకినాడ జిల్లాలో తన మొదటి రోజు పర్యటనని ముగించుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో వేదనకు గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకే ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం నుంచి మొదలుకొని మూడు రోజుల పాటు ఆమె తన పర్యటనని కొనసాగించనున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా ఆమె జగ్గంపేట, పెద్దాపురం, తుని రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో నలుగురు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. అనంతరం అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్‌లోని విడిది కేంద్రానికి చేరుకున్నారు. రేపు (25/01/24) అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో ఆమె పర్యటించనున్నారు.

Updated Date - Jan 24 , 2024 | 07:36 PM