నేటి నుంచి శ్రీశైలంకు అదనపు బస్సు
ABN , Publish Date - Aug 13 , 2024 | 11:47 PM
అద్దంకి నుంచి శ్రీశైలంకు బుధవారం నుంచి అదనంగా బస్ సర్వీసును నడుపనున్నట్లు డీఎం బెల్లం రామ్మోహనరావు తెలిపారు. అద్దంకి, ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి మండలాలలోని పలు గ్రామాల ప్రజలు నేరుగా శ్రీశైలం వెళ్లేందుకు బస్ సర్వీసును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
4 మండలాల ప్రయాణికులకు సౌకర్యం
అద్దంకి, ఆగస్టు 13 : అద్దంకి నుంచి శ్రీశైలంకు బుధవారం నుంచి అదనంగా బస్ సర్వీసును నడుపనున్నట్లు డీఎం బెల్లం రామ్మోహనరావు తెలిపారు. అద్దంకి, ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి మండలాలలోని పలు గ్రామాల ప్రజలు నేరుగా శ్రీశైలం వెళ్లేందుకు బస్ సర్వీసును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అద్దంకిలో ఉదయం 6-30 గంటలకు బయలుదేరి ముండ్లమూరు, తాళ్లూరు, తూర్పుగంగవరం, బొద్దికూరపాడు, రాజంపల్లి మీదుగా పొదిలికి 8-50 గంటలకు చేరుతుందన్నారు. అక్కడ 9-15కి బయలుదేరి మార్కాపురం మీదుగా మధ్యాహ్నం 1 గంటకు శ్రీశైలం చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో శ్రీశైలంలో మధ్యాహ్నం 2-15 గంటలకు బయలుదేరి పొదిలి 6-15 గంటలకు చేరుతుందన్నారు. అక్కడ నుంచి 6-30 గంటలకు బయలుదేరి రాజంపల్లి, బొద్దికూరపాడు, తూర్పుగంగవరం, తాళ్లూరు, ముండ్లమూరు మీదుగా రాత్రి 9 గంటలకు అద్దంకికి చేరుతుందన్నారు. ఆయా గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎం రామ్మోహనరావు కోరారు.