30న బాలకృష్ణ పర్యటన
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:59 AM
టీడీపీ నేత, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఈనెల 30న జిల్లాలో పర్యటించనున్నారు. కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
కొండపి, ఎస్ఎన్పాడు నియోజకవర్గాల్లో రోడ్షో, సభలు
ఒంగోలు, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ నేత, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఈనెల 30న జిల్లాలో పర్యటించనున్నారు. కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు... 30వతేదీ సాయంత్రం 4 గంటలకు కొండపి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన మర్రిపూడికి ఆయన హెలికాప్టర్లో చేరుకుంటారు. సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడ రోడ్షో, సభలో పాల్గొంటారు. అనంతరం రోడ్డుమార్గంలో సంతనూతలపాడు నియోజకవర్గానికి వస్తారు. ఆ నియోజకవర్గంలోని మండల కేంద్రాలైన చీమకుర్తి లేదా సంతనూతలపాడుల్లో ఒక చోట రోడ్షోలో పాల్గొంటారు. ఎక్కడ అనేదానిపై శనివారం స్పష్టత రానుంది.