Share News

కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:02 PM

ముండ్లమూరు మండలంలోని రెడ్డినగర్‌ సమీపంలో అద్దంకి - దర్శి ప్రధాన రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి.

కారు ఢీకొని ఇద్దరికి   తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడిన సందు శివలీల

మహిళ కాలు వేళ్లు తెగి రోడ్డుపై పడిన వైనం

ముండ్లమూరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని రెడ్డినగర్‌ సమీపంలో అద్దంకి - దర్శి ప్రధాన రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... అద్దంకి నుంచి కారు దర్శి వైపు వెళ్తుండగా దర్శి పట్టణంలోని సందువారిపాలేనికి చెందిన కొందరు కూలీలు ఆటోలో పసుపుగల్లులో కరివేపాకు కోతకు వస్తున్నారు. అదే సమయంలో దర్శి మండలం కట్టుబడివారిపాలేనికి చెందిన ఐ నాగేష్‌ బైక్‌పై ముండ్లమూరు వస్తుండగా వేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహన చోదకుడిని తప్పించబోయి పక్కగా వెళ్తున్న ఆటోను ఢీకొంది. అందులో ఉన్న సందువారిపాలెం గ్రామానికి చెందిన సందు శివలీల కాలు పూర్తిగా తెగి వేళ్లు రోడ్డు మీద పడ్డాయి. అందులో ప్రయాణిస్తున్న ఒకరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ద్విచక్ర వాహన చోదకుడు నాగే్‌షకు గాయాలయ్యాయి. వెంటనే బాధితులను 108 దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు మాత్రం ఇరువురిని ఢీకొట్టి రోడ్డు పక్కన చిల్లచెట్లలోకి దూసుకుపోయింది.

Updated Date - Oct 22 , 2024 | 11:02 PM