వలంటీర్లపై వేటు
ABN , Publish Date - Mar 27 , 2024 | 01:02 AM
ఎన్నికల కోడ్ను యథేచ్ఛగా ఉల్లంఘించి వైసీపీ కార్యక్రమాలు, ప్రచారంలో పాల్గొన్న వలంటీర్లపై వేటుపడింది.
వైసీపీకి మద్దతుగా పనిచేస్తున్న నలుగురు తొలగింపు
చీమకుర్తి, మార్చి 26 : ఎన్నికల కోడ్ను యథేచ్ఛగా ఉల్లంఘించి వైసీపీ కార్యక్రమాలు, ప్రచారంలో పాల్గొన్న వలంటీర్లపై వేటుపడింది. మండలంలోని పి.నాయుడుపాలెంకు చెందిన వలంటీర్లు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, మంత్రి మేరుగ నాగార్జునకు మద్దతుగా పనిచేస్తున్నారు. గ్రామానికి చెందిన కొందరిని సోమవారం వైసీపీలో చేర్పించారు. మంత్రి సమక్షంలో జరిగిన ఆ కార్యక్రమంలో వలంటీర్లు తిరుపతిస్వామి, సుబ్రహ్మణ్యం, వెంకట్రావు పాల్గొన్నారు. వీరితోపాటు సామాజిక మాధ్యమాల్లో వైసీపీని గెలిపించాలని కోరుతూ పోస్టులు పెడుతున్న లక్ష్మణ్యాదవ్ అనే వలంటీర్ని విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో రాఘవేంద్ర తెలిపారు.