Share News

అన్న క్యాంటీన్‌కు దాతల విరాళాలు

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:58 AM

పట్టణం లోని అన్నక్యాంటీన్‌ నిర్వహణకు ఎన్‌డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు విరాళాలు అందజేస్తున్నారు.

అన్న క్యాంటీన్‌కు దాతల విరాళాలు

గిద్దలూరు టౌన్‌, సెప్టెంబరు 20 : పట్టణం లోని అన్నక్యాంటీన్‌ నిర్వహణకు ఎన్‌డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు విరాళాలు అందజేస్తున్నారు. వారంతా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి చేతికి చెక్కులు, నగదు రూపంలో విరాళాలు అందజేశారు. వారిని అభినందించారు. అన్న క్యాంటీన్‌ ప్రారంభం సందర్భంగా విరాళాలు అందించిన వారిలో పట్టణానికి చెందిన దండె బోయిన రమణ రూ.21,000, పొదలకొండపల్లెకు చెందిన చేరెడ్డి యర్రారెడ్డి రూ.10,000, పట్టణా నికి చెందిన గోడి సూర్యనారాయణరెడ్డి, జెర్రిబో తుల శ్రీనివాసులు, సూరా గురువారెడ్డి, పొట్టిరెడ్డి వెంకటే శ్వర్‌రెడ్డిలు కలిసి రూ.16,000, కంభం మండలం తురిమెళ్ల సర్పంచ్‌ మాదా సుభద్ర రూ.20,000, కొమరోలుకు చెందిన పట్టాభి రామస్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు పెనుగొండ వెంకట రమణ, ఆర్యమరాఠి మిత్రబృందం కలిసి రూ.10,000, బేస్తవారపేటకు చెందిన మేఘన రెస్టారెంట్‌ యజమాని యాగాల వెంకటేశ్వర్లు రూ.10,116, నగర పంచాయతీ పరిధిలోని చట్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన దండూరి సోమయ్య రూ.25,000 అందించారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వారిని ప్రత్యేకంగా అభినందించారు.

మొక్కలు నాటిన ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి

నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మొక్కలు నాటారు. మొక్కలు నాటిన అనంతరం నీరు పోసి మొక్కలు పెరిగే విధంగా సిబ్బంది చూడాలని సూచించారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, మున్సిపల్‌ కమీషనర్‌ వెంకటదాస్‌, కౌన్సిలర్లు చంద్రశేఖర్‌, లొక్కు రమేష్‌, గడ్డం భాస్కర్‌ రెడ్డి ఉన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:58 AM