రానున్నది టీడీపీ ప్రభుత్వమే : ఎరిక్షన్బాబు
ABN , Publish Date - Feb 17 , 2024 | 12:41 AM
రాష్ట్రంలో ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్బాబు అన్నా రు.
పెద్ద దోర్నాల, ఫిబ్రవరి 16: రాష్ట్రంలో ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్బాబు అన్నా రు.మండలంలోని చింతల అగ్రహారం గ్రామం లో శుక్రవారం బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన గ్రామంలోని ప్రజలను కలుసు కొని గడిచిన ఈ ఐదేండ్ల కాలంలో ప్రజలు ఎంతగా ఇబ్బంది పడ్డారో తెలియజేశారు. గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేశాడు. టీడీపీ హయాంలో ప్రతి గ్రామంలో 80శాతానికి పైగా సిమెంటు రోడ్లు నిర్మాణం, ఎటువంటి క్లిష్ట సమయంలోనూ త్రాగునీటి సరఫరా, ప్రకృతి విపత్తులలో రైతులకు నష్టపరిహారం అందజేత, వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రాయితీతో ట్రాక్టర్లు, స్ర్పేయర్లు, డ్రిప్ అందజేత, నిలకడగా నిత్యా వసర సరుకులు, అదపులో పెట్రోలు, గ్యాస్ ధరలు ఉన్నాయన్నారు. ఇక వైసీపీ పాలనలో ఏ ఒక్కటి సవ్యంగాలేవని, సామాన్యుడి నడ్డి విరిచేలా ధరలు ఆకాశనంటాయన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆశలు వమ్ము చేశారని ఆరో పించారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్సిక్స్ పథకాల గురించి వివరించారు. ఈ పధకాల అమలు కోసం ముందుగానే ష్యూరిటీ బాండ్లను అందజేస్తు న్నామని చెప్పారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తానని తనను ఆదరిం చాలని సైకిలు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏర్వ మల్లికార్జునరెడ్డి, నాయకులు షేక్ మాబు, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, చంటి, షేక్ ఇస్మాయిల్, చల్లా వెంకటేశ్వర్లు, షేక్ భాష, ఎలకపాటి చంచయ్య, సీనియర్ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, కె సుబ్బారెడ్డి పాల్గొన్నారు.