క్యాజువాల్టీలో బెడ్పై మందుబాబు
ABN , Publish Date - Jul 26 , 2024 | 11:51 PM
‘బయట ఎండ ఎక్కువగా ఉంది. ఉక్క పోస్తుంది. ఏరియా హాస్పిటల్లో చల్లగా ఉంటుంది. కాసేపు పడుకుని రెస్ట్ తీసుకుందామనిపించింది. ఆ మందుబాబుకి.. ఇంకేముంది క్వార్టర్ మందు వేసి ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాజువాలిటీలో బెడ్పై పడుకొని మత్తు నిద్రలోకి జారుకున్నాడు. ఆసుపత్రి సిబ్బంది వచ్చి లేపడంతో అసహనం వ్యక్తం చేశాడు. ఈఘటన చీరాల ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం వెలుగుచూసింది.
చీరాలటౌన్ జూలై 26 : ‘బయట ఎండ ఎక్కువగా ఉంది. ఉక్క పోస్తుంది. ఏరియా హాస్పిటల్లో చల్లగా ఉంటుంది. కాసేపు పడుకుని రెస్ట్ తీసుకుందామనిపించింది. ఆ మందుబాబుకి.. ఇంకేముంది క్వార్టర్ మందు వేసి ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాజువాలిటీలో బెడ్పై పడుకొని మత్తు నిద్రలోకి జారుకున్నాడు. ఆసుపత్రి సిబ్బంది వచ్చి లేపడంతో అసహనం వ్యక్తం చేశాడు. ఈఘటన చీరాల ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానిక విఠల్నగర్కు చెందిన దానియేలు కుటుంబ సమస్యలతో మద్యానికి బానిసగా మారాడు.శుక్రవారం మద్యం బాగా పట్టించాడు. ఆతరువాత చీరాల ఏరియా హాస్పిటల్లో బెడ్లు బాగుంటాయి. పైగా చుట్టూ చెట్లతో చల్లగా ఉంటుందని భావించాడు. ఈక్రమంలోనే ఊగుకుంటూ హాస్పిటల్లో క్యాజువాల్టీకి వచ్చాడు. అప్పటికే హాస్పిటల్ సిబ్బంది ఓ యాక్సిడెంట్ కేసుకు సంబంధించిన వారికి వైద్యం అందిస్తూ బిజీగా ఉన్నారు. దీంతో అతనే మంచి బెడ్ చూసుకున్నాడు. నేరుగా ఫ్యాన్ వేసుకుని పవళించాడు. ఇతని బెడ్ వద్దకు వచ్చాక ఆరోగ్య సిబ్బంది లేపి బాబు ఏమిటి మీ సమస్య అని అడిగారు. మందు వేశాను. కాసేపు పడుకుంటానని నిద్ర మత్తులో చెప్పాడు. బిత్తర పోయిన సిబ్బంది సెక్యూరిటీ సహాయంతో బయటకు పంపించారు. ఇదంతా గమనించిన ఆంధ్రజ్యోతి ఆ సన్నివేశాలను కెమెరాలో బంధించింది.