Share News

78 బాటిళ్ల మద్యం పట్టివేత

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:25 AM

ప్రభుత్వ మద్యందుకాణం నుంచి బెల్ట్‌షాపునకు తరలిస్తున్న 78 మద్యం బాటిళ్లను ఎస్‌ఈబీ అధికారులు సీజ్‌ చేశారు.

78 బాటిళ్ల మద్యం పట్టివేత

దుకాణం సేల్స్‌మెన్‌, కొనుగోలుదారుడు అరెస్టు

ఒంగోలు క్రైం, మార్చి 27: ప్రభుత్వ మద్యందుకాణం నుంచి బెల్ట్‌షాపునకు తరలిస్తున్న 78 మద్యం బాటిళ్లను ఎస్‌ఈబీ అధికారులు సీజ్‌ చేశారు. సేల్స్‌మె న్‌, బెల్టుషాప్‌ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. బుధవారం ఒంగోలు నగరం క ర్నూలురోడ్డులోని పవర్‌ఆఫీస్‌ ఎదురుగా ఉన్న మద్యం దుకాణంలో బాలాజీ రావుపేటకు చెందిన గంటా శేఖర్‌బాబు సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వెంగ ముక్కపాలెం రోడ్డులో గల మదర్‌తెరిస్సా కాలనీకి చెందిన నత్తల అజయ్‌కుమా ర్‌కు 78 క్యార్టరు బాటిళ్లు విక్రయించాడు. బాటిల్‌కు అదనంగా రూ.10 తీసుకు న్నాడు. ఈమేరకు సమాచారం తెలుసుకున్న ఎస్‌ఈబీ సీఐ సూర్యనారాయణ, ఎస్సై సీహెచ్‌.గీత తమ సిబ్బందితో వెళ్లి ఇరువురిని అదుపులోకి తీసుకొని మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఇరువురిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Mar 28 , 2024 | 12:25 AM