చేనేత అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
ABN , Publish Date - Apr 07 , 2024 | 11:08 PM
మాటల్లో చెప్పటం కన్నా, అవకాశం ఇస్తే చేతల్లో చేసి చూపిస్తా.. చీరాల నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచేవిధంగా నడుచుకుంటానని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య అన్నారు. మండలంలోని దేవాంగపురిలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు ఫుృధ్వి లలితామోహన్, వ్యాపారవేత్త సిద్ధి బుచ్చేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన చేనేతల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
చీరాల ప్రజల గుండెల్లో నిలిచేవిధంగా నడుచుకుంటా
ఆత్మీయ సమావేశంలో కూటమి అభ్యర్థి కొండయ్య
చీరాల, ఏప్రిల్ 7: మాటల్లో చెప్పటం కన్నా, అవకాశం ఇస్తే చేతల్లో చేసి చూపిస్తా.. చీరాల నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచేవిధంగా నడుచుకుంటానని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య అన్నారు. మండలంలోని దేవాంగపురిలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు ఫుృధ్వి లలితామోహన్, వ్యాపారవేత్త సిద్ధి బుచ్చేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన చేనేతల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. నేతన్నలు సంక్షేమానికి, అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తామన్నారు. టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు అవసరమైతే తాము భూమి కొనుగోలుచేసి మరీ ప్రభుత్వానికి ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు మువ్వల వెంకటరమణరావు, జనసేన, టీడీపీ నాయకులు, నేతన్నలు పాల్గొన్నారు.
80 కుటుంబాలు టీడీపీలో చేరిక
స్ధానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం వేటపాలెంకు చెందిన 80 కుటుంబాలు టీడీపీ నేత పొగడదండ వెంకటేశ్వర్లు కుమారులు సుబ్బారావు, నరసింహారావుల ఆధ్వర్యంలో కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరారు. వారి మెడలో కొండయ్య పార్టీ కండువాలువేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ ఐకమత్యంగా అడుగులు వేద్దామన్నారు. కార్యక్రమంలో కొండయ్య కుమారులు గౌరీఅమర్నాధ్, మహేంధ్రనాధ్, సీనియర్ నాయకుడు నాశిక వీరభద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో కొండయ్య చినకుమారుడు మహేంధ్రనాధ్, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావులు ఆదివారం వివిధ ప్రాంతాల్లో ఓటర్లును కలిశారు. కొండయ్యను గెలిపించాలని కోరారు. బోయినవారిపాలెంకు చెందిన యువకులు కొండయ్య పెద్దకుమారుడు గౌరీఅమర్నాధ్ను కలసి సంఘీభావం ప్రకటించారు. తామంతా కొండయ్య గెలుపునకు కృషి చేస్తామని చెప్పారు.
మండలంలోని బుర్లవారిపాలెంలో ఆదివారం జయహో బీసీ కార్యక్రమంలో ్ధ కొండయ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా సూపర్ సిక్స్ పథకాలు, బీసీ డిక్లరేషన్తో కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈపురుపాలెంలో కుర్రు కోటయ్య కమ్యూనిటీలో జరిగిన జనసేన పార్టీలో చేరికలకు హాజరయ్యారు. అలాగే, వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో కొండయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ బీసీ డిక్లరేషన్ ప్రయోజనాలను వివ రించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందు పవిత్ర కార్యం
చీరాల, ఏప్రిల్ 7: మండల పరిధిలోని ఈపురుపాలెంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి కొండయ్య హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం విందులో వడ్డన చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకుడు గుద్దంటి చంద్రమౌళి, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.