Share News

విద్యార్థుల సేవాదృక్పథం అభినందనీయం

ABN , Publish Date - Sep 19 , 2024 | 11:04 PM

విద్యార్థుల సేవాదృక్పథం అభినందనీయమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. స్వర్ణ రోడ్డులోని శ్రీసత్యసాయి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో గురువారం జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కొండయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూల్‌లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సేకరించిన రూ.50వేలను చెక్కు రూపంలో వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇవ్వాలని ఎమ్మెల్యే కొండయ్యకు అందజేశారు.

విద్యార్థుల సేవాదృక్పథం అభినందనీయం
సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొండయ్య

ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, సెప్టెంబరు 19 : విద్యార్థుల సేవాదృక్పథం అభినందనీయమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. స్వర్ణ రోడ్డులోని శ్రీసత్యసాయి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో గురువారం జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కొండయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూల్‌లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సేకరించిన రూ.50వేలను చెక్కు రూపంలో వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇవ్వాలని ఎమ్మెల్యే కొండయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐకమత్యంగా ముందడుగు వేస్తే ఎన్ని సమస్యలనైనా సునాయాసంగా జయించవచ్చన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధిలో అందరం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్ధులు చక్కగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో స్కూల్‌ యాజమాన్య ప్రతినిధులు, అధ్యాపకులు, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2024 | 11:04 PM