Share News

Kakani Govardhan Reddy: కాకాణి సొంతూరులో రియల్ మాఫియా కుంభకోణం..

ABN , Publish Date - Jul 05 , 2024 | 10:04 AM

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంతూరైన తోడేరులో రియల్ మాఫియా భారీ కుంభకోణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నుడా అధికారుల నకిలీ సంతకాలతో ఫేక్ అనుమతులను మాఫియా సృష్టించింది. నుడా అనుమతి ఉందంటూ ప్రజలని దగా చేస్తున్నారు.

Kakani Govardhan Reddy: కాకాణి సొంతూరులో రియల్ మాఫియా కుంభకోణం..

నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంతూరైన తోడేరులో రియల్ మాఫియా భారీ కుంభకోణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నుడా అధికారుల నకిలీ సంతకాలతో ఫేక్ అనుమతులను మాఫియా సృష్టించింది. నుడా అనుమతి ఉందంటూ ప్రజలని దగా చేస్తున్నారు. స్వర్ణ గార్డెన్స్ పేరుతో రూ.200కోట్లకి పైగా స్వాహా చేశారు. పొదలకూరు మండలంలోనే 52 అక్రమ లే అవుట్లు వేసి మంత్రి అనుచరులు అమ్మకాలు సాగించారు. పొదలకూరు పోలీసులకు నుడా వైస్ ఛైర్మన్ బాబిరెడ్డి ఫిర్యాదు చేశారు. రియల్ మాఫియా కుంభకోణాల డబ్బునే‌ మాజీ మంత్రి కాకాణి, ఎన్నికల్లో ఖర్చు చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Updated Date - Jul 05 , 2024 | 11:15 AM