Share News

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయండి: రామకృష్ణ

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:38 AM

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను వచ్చే ఆగస్టు 15న విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయండి: రామకృష్ణ

అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను వచ్చే ఆగస్టు 15న విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి గురువారం ఆయన లేఖ రాశారు. క్షణికావేశంలోనో, ఆగ్రహంతోనో తప్పు చేసినవారు సంవత్సరాల తరబడి జైలు గోడల మధ్య ఖైదీలుగా ఉండిపోతున్నారు. వారికి క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలి’ అని రామకృష్ణ కోరారు.

Updated Date - Jul 05 , 2024 | 07:47 AM