Share News

AP News: జగ్గయ్యపేట ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన అద్దె బస్సులు

ABN , Publish Date - Jul 03 , 2024 | 08:14 AM

జగ్గయ్యపేటలో ఆర్టీసీ డిపోలో అద్దె బస్సులు నిలిచిపోయాయి. విజయవాడకు చెందిన ఓ అద్దె బస్సుల యజమానికి ఎక్కువ ప్రయార్టి ఇస్తున్నారని.. స్థానికంగా ఉన్న వాహనాలకు ప్రయారిటీ ఇచ్చే విషయంలో అధికారులు దోబూచులు ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు యజమానులు బస్సులను నిలిపివేశారు.

AP News: జగ్గయ్యపేట ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన అద్దె బస్సులు

జగ్గయ్యపేట: జగ్గయ్యపేటలో ఆర్టీసీ డిపోలో అద్దె బస్సులు నిలిచిపోయాయి. విజయవాడకు చెందిన ఓ అద్దె బస్సుల యజమానికి ఎక్కువ ప్రయార్టి ఇస్తున్నారని.. స్థానికంగా ఉన్న వాహనాలకు ప్రయారిటీ ఇచ్చే విషయంలో అధికారులు దోబూచులు ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు యజమానులు బస్సులను నిలిపివేశారు. విజయవాడలోని ఓ అధికారి నిర్ణయంతో ఒకే యజమానికి మూడు బస్సులు తిప్పుకునేందుకు పర్మిషన్ ఇవ్వటంపై స్థానిక యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా విజయవాడ వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడుతామని డిపో మేనేజర్ చెబుతున్నారు.

Updated Date - Jul 03 , 2024 | 08:14 AM