పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
ABN , Publish Date - May 26 , 2024 | 11:30 PM
మందస మండలం సొండిపూడి హైస్కూల్లో 2001-02లో పదోతరగతి చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల ఆవరణలో నిర్వహిం చారు.
హరిపురం: మందస మండలం సొండిపూడి హైస్కూల్లో 2001-02లో పదోతరగతి చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల ఆవరణలో నిర్వహిం చారు. సుమారు 60 మంది పూర్వ విద్యార్థులు హాజరై నాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పాఠశాలకు అవ సరమైన వనరుల కోసం రూ.20 వేలు అందజేశారు. కలం.. గళం పేరుతో గేయాలతో సమాజాభివృద్ధికి, ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్న నాటి ఉపాధ్యాయులు నగిరి కరుణాకర్, దుర్యోధనలను సత్కరించారు. కార్యక్ర మంలో పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు జి.భీమారావు, వై.రాజు, పి. మోహనరావు, ఎస్.శ్రీను, విద్యాసాగర్, గ్రీన్ ఆర్మీ అఽధ్యక్షుడు బి.గోపాల్, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రాజు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు: అక్కుపల్లి హైస్కూ ల్లో 1995-96లో పదోతరగతి చదువుకున్న విద్యార్థులు ఆది వారం ఒకేచోట కలుసుకున్నారు. శివసాగర్ బీచ్లో కలుసుకొని నాటి జ్ఞాపకాలు, ఉపాధ్యాయులతో అనుబంధాలు ఒకరికొ కరు తెలుపుకుని ఆనందం పొందారు.