బెదిరింపుల పాలనకు చరమగీతం: ఎంపీ
ABN , Publish Date - Jan 03 , 2024 | 11:49 PM
ఇటు ప్రజ లను, అటు ఉద్యోగుల ను నిరంతరం భయపె డుతూ బెదిరిస్తూ కొన సాగిస్తున్న ముఖ్యమ ంత్రి జగన్రెడ్డి పాలన కు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడను న్నారని ఎంపీ కింజరా పు రామ్మోహన్నాయుడు అన్నారు.
బూర్జ: ఇటు ప్రజ లను, అటు ఉద్యోగుల ను నిరంతరం భయపె డుతూ బెదిరిస్తూ కొన సాగిస్తున్న ముఖ్యమ ంత్రి జగన్రెడ్డి పాలన కు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడను న్నారని ఎంపీ కింజరా పు రామ్మోహన్నాయుడు అన్నారు. బుధవారం నీలాపురం, తుడ్డలి గ్రామాల్లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం టీడీపీ సీ నియర్ నాయకుడు కత్తెర నర్సింగరావును పరామర్శించి విలేకరులతో మాట్లాడారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. నారా లోకేష్ యువగళంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పిచ్చెక్కిపోయారన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో గ్రామాల్లో పర్యటిస్తున్న టీడీపీ నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఆయనతో పాటు తుడ్డలి సర్పంచ్ అంపిలి ప్రభావతి, బూర్జ ఎంపీడీసీ చొక్కార పోలినాయుడు, నాయకులు పీరుకట్ల విశ్వ ప్రభాకరరావు, గణపతిరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.