కొత్త అజెండాతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి
ABN , Publish Date - Feb 25 , 2024 | 12:10 AM
ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందా లంటే ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సరికొత్త ప్రజా మేనిఫెస్టో తయారు కావాలని ఉత్త రాంధ్ర చర్చా వేదిక కో-కన్వీనర్ భీశెట్టి బాబ్జీ అన్నారు.
అరసవల్లి: ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందా లంటే ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సరికొత్త ప్రజా మేనిఫెస్టో తయారు కావాలని ఉత్త రాంధ్ర చర్చా వేదిక కో-కన్వీనర్ భీశెట్టి బాబ్జీ అన్నారు. శనివారం ఎన్జీవో హోంలో పంచాది రాంబాబు అధ్యక్షతన వివిధ ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడాల్సిన మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎంపీలు తమ సొంత ప్రయోజ నాల కోసం పనిచేసుకుంటూ ప్రజా సమస్యలను గాలి కి వదిలేశారన్నారు. శ్రీకాకుళం, విజయ నగరం తాగు, సాగునీటి ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సుజ ల స్రవంతి, తోటపల్లి, వంశధార రెండో దశ, గజపతినగరం బ్రాంచ్ కాలువ, వంశధార, నాగా వళి నదుల అనుసంధానం, మహేంద్ర తనయ రిజర్వాయర్, మడ్డువలస రెండో దశ, తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు పనులతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు నేటికీ పూర్తికాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమావేశంలో బి.జగదీష్, బి.గౌరీ శంకర్, బి.జానకిరామ్, జె.బాలరాజు, లక్ష్మణ్, యు.శివతేజ, సుప్రజ, రవితేజ, చిన్మయరావు తదితరులు పాల్గొన్నారు.