Share News

Divvala Madhuri: దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం వేళ దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:03 PM

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చెలరేగిన వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

Divvala Madhuri: దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం వేళ దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదం
Divvala Madhuri,

పలాస: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చెలరేగిన వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఆగివున్న ఓ కారును దివ్వెల మాధురి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి గాయాలయ్యాయి. ఆమెను పలాస ఆస్పత్రికి తరలించారు. కాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబ వ్యవహారంలో దివ్వెల మాధురి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టెక్కలి నుంచి పలాస వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.


మాధురి బిగ్ ట్విస్ట్...

తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనపై, తన పిల్లలపై ట్రోల్స్‌ను తట్టుకోలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని దివ్వెల మాధురి చెప్పారు. హాస్పిటల్‌కు తరలించగా.. బెడ్‌పై పడుకొని ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది రోడ్డుప్రమాదం కాదు. నేనే కారును ఢీకొట్టా. దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారంలో వాణి ఆరోపణలను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. వైద్యులు నాకు చికిత్స అందించవద్దు’’ అని దివ్వెల మాధురి కోరారు.

Updated Date - Aug 11 , 2024 | 04:55 PM