వరద బాధితులకు అండగా డీఎస్సీ-98 ఉపాధ్యాయులు
ABN , Publish Date - Sep 20 , 2024 | 11:40 PM
జయవాడ వరద బా ధితులకు డీఎస్పీ 1998 ఉపాధ్యాయు లు తమ ఒక్కరోజు వేతనం రూ.38,11, 500 విరాళంగా అందజేశారు.
కంచిలి/ గుజరాతీపేట: విజయవాడ వరద బా ధితులకు డీఎస్పీ 1998 ఉపాధ్యాయు లు తమ ఒక్కరోజు వేతనం రూ.38,11, 500 విరాళంగా అందజేశారు. ఈ మేరకు శుక్రవారం కవిటి మండలం రాజపురం గ్రామంలో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్యెల్యేలు అశోక్, శిరీషలకు తమ అంగీకార పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో బి.కామేష్ రెడ్డి, బి.అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ డీఎస్పీలో మొత్తం 4072 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.
పేదల ఆకలి తీర్చడమే టీడీపీ లక్ష్యం
ఆమదాలవలస: రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు తిండి, గూడు, గుడ్డ కల్పించడమే టీడీపీ లక్ష్యమ ని ఎమ్మెల్యే కూన రవికు మార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత టీ డీపీ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటీనను ఏర్పాటు చే సి పేదలకు రూ.5కే అల్పాహారం భోజనం, రాత్రి భోజనం అందిస్తే రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు ఆకలి తీర్చుకుంటున్నాయన్నారు. అటువంటి అన్నా క్యాంటీన్ను దు ర్మార్గుడైన జగన్రెడ్డి రద్దు చేసి పేదవాడి నోటి ముందు ఆహారాన్ని తీసేశారన్నారు. ఇప్పుడు మళ్లీ పేదవాడి ఆకలి తీర్చేందుకే వీటిని తిరిగి ప్రారంభించామన్నారు మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, కూటమి నాయకులు రామ్మోహన్, సూరప ునాయుడు, తమ్మినేని గీతా, నూకరాజు, ఢిల్లీశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.